📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి: బండి సంజయ్

Author Icon By sumalatha chinthakayala
Updated: February 13, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయి...హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. బిసి రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదనేది తేట తెల్లమైందన్నారు. బిసిల్లో ముస్లింలను చేర్చడం వల్ల బిసిలకు రిజర్వేషన్లు తగ్గుతాయని చెప్పారు. బిసిలకు కాంగ్రెస్ మరింత అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి.

బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై :

కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బిసి జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదని దుయ్యబట్టారు. ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు రావని, నిధులు రావని తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు జాప్యం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా అని నిలదీశారు. ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదని చెప్పారు.

కాంగ్రెస్‌కు బిసి రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలత

73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు…. రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలని హితవు పలికారు. సర్పంచ్ లేకుంటే గ్రామసభలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేదెలా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా? అని నిలదీశారు. ఓడిపోతామనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని బండి సంజయ్ విమర్శించారు.

బీసీలకు అన్యాయం

బీసీలను కాపాడటానికి ముస్లింలను జాబితా నుంచి తొలగించడం అత్యంత అవసరం. బీసీలను అబద్ధంగా ముస్లింలను జాబితాలో చేర్చి వారి హక్కులపై మరింత అన్యాయం చేస్తున్నది. నిజాయితీగా, ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం వల్ల పేద బీసీ వర్గాలకు న్యాయం జరుగదు. బీసీలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకోవడం దారుణమైన చర్య. ఈ నిర్ణయం, దేశ వ్యాప్తంగా బీసీ వర్గానికి అనుకూలంగా ఉంటుంది, అవినీతి తగ్గించి, నిజమైన సామాజిక న్యాయాన్ని అందిస్తుంది. బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడమే గ్యారంటీ.

Bandi sanjay bc Google news Google News in Telugu Muslims Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.