Eatala Rajendar : జమ్ము కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో సుమారు 28 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్లో టెర్రరిస్ట్ ఎటాక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పారు.

బాధితులు చిందించిన రక్తం వృథా పోదు
కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు. బాధితులు చిందించిన రక్తం వృథా పోదు. తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అని స్పష్టంచేశారు.
ప్రమాదం కలిగితే ప్రతిస్పందన తప్పదు
ఇలాంటి ఉగ్రవాద దాడులపై అంతర్జాతీయ సమాజం కూడా స్పందించాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ మద్దతుతో జరుగుతున్న దాడులపై ప్రపంచ దేశాలు గళం వినిపించాలి. భారత్ శాంతికాముక దేశం కానీ, ఆ శాంతికి ప్రమాదం కలిగితే ప్రతిస్పందన తప్పదు అని చెప్పారు. భారత ప్రజలు ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ ప్రభుత్వాన్ని ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈటల రాజేందర్ వంటి నాయకుల ప్రకటనలు భారతదేశం యొక్క ఉగ్రవాదంపై ఉన్న దృఢమైన అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి.
Read Also: జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి ఘటన పై స్పందించిన అసదుద్దీన్