ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి

Read Time:  1 min
Delhi CM Atishi exercised the right to vote
Delhi CM Atishi exercised the right to vote
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిషి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో సీఎం అతిషి ఓటు వేశారు. ఓటు వేసే ముందు కల్కాజీ ఆలయంలో అతిషి ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ఓటు వేశారు. ఈ సందర్బంగా అతిశి మాట్లాడుతూ.. ఢిల్లీలో ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. ఇది ధర్మయుద్ధం. ఇది మంచికి, చెడుకి మధ్య పోరాటం. ఒక వైపు అభివృద్ధి కోసం పనిచేస్తున్న విద్యావంతులు, మరోవైపు గూండాయిజం చేసే వ్యక్తులు ఉన్నారు. గూండాలకు కాకుండా పనిచేసే వారికే ప్రజలు ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది.

image

ఢిల్లీ పోలీసులు బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాగా, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక, తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారని, ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.