అమెరికా మాజీ అధ్యక్షుడు క‌న్నుమూత‌

Read Time:  1 min
Former US President Jimmy Carter has passed away
Former US President Jimmy Carter has passed away
FONT SIZE
GET APP

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్‌ ఇ. కార్టర్‌ తెలిపారు. “నా తండ్రి నాకు మాత్రమే కాదు, శాంతి, మానవ హక్కులు, నిస్వార్థ ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరికీ హీరో” అని ఆయ‌న కుమారుడు చిప్ కార్టర్ తెలిపారు. రెండు నెలల క్రితమే (అక్టోబర్‌ 1న) 100వ పుట్టిన రోజు జరుపుకున్న కార్టర్‌.. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు జీవించిన తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టించారు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన డెమొక్రటిక్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.

1924 అక్టోబర్ 1న రైతు కుటుంబంలో జన్మించిన జ‌మ్మీ కార్టర్‌.. అమెరికా రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. 1977లో అసాధార‌ణ రీతిలో ఆయ‌న దేశాధ్యక్ష బాధ్యత‌లు చేప‌ట్టారు. 1981 వరకు ప్రెసిడెంట్‌గా కొనసాగారు. కాగా, 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు. మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక 1960ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1971లో తొలిసారిగా జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సరిగ్గా ఆరేండ్ల తర్వాత రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ను ఓడించి జిమ్మీ కార్టర్‌ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కాగా, ఆయ‌న భార్య రోసలిన్ (96) 2023 నవంబర్ 19న మరణించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.