News Telugu: Road Accident- ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

Read Time:  1 min
News Telugu:
News Telugu:
FONT SIZE
GET APP

News Telugu: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుండి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు (Container truck) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 43 మంది గాయపడ్డారు.

యాత్రికుల వివరాలు

ప్రమాదంలో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ కాస్‌గంజ్ జిల్లా రాఫత్‌పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులతో వెళ్తుంది. వీరు రాజస్థాన్‌ (Rajasthan) లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి బయలుదేరారు.

News Telugu:
News Telugu:

ప్రమాదం ఎలా చోటుచేసుకుంది

సోమవారం తెల్లవారుజామున రాత్రి 2:15 గంటల సమయంలో, బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి-34పై ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో, ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం స్థలానికి జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీ మరియు స్థానిక పోలీసులు వెంటనే చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి, అత్యంత తీవ్రంగా గాయపడిన ముగ్గురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంలో మరణించిన వారిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ట్రాలీని రహదారిపై నుంచి తొలగించగా, కాంటైనర్ ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులవారే కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/delhi-cm-sensational-details-of-the-attack-case-on-rekha-gupta/national/535576/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.