దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్ష ఇవాళ (మే 5) జరుగుతోంది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు దేశవ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో 190 పరీక్ష కేంద్రాల ఏర్పటు
తెలంగాణలో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 65,000 మంది విద్యార్థులు NEET పరీక్షకు హాజరవుతారు. ప్రభుత్వ యంత్రాంగం వారి సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి, అభ్యర్థులకు సహాయంగా ఉండేలా చూసారు.
అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తీసుకెళ్లాలి
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి వాటిని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లవద్దని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. పరీక్షా సమయానికి 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండ ప్రశాంతంగా పరీక్ష రాయాలని అధికారుల విజ్ఞప్తి.
Read Also : India : భారత్ షాకింగ్ నిర్ణయం..కృష్ణమూర్తిని కేంద్రం తొలగింపు