📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bilawal Bhutto Zardari : మొన్న రక్తం అన్నాడు..నేడు శాంతి అంటున్నాడు

Author Icon By Sudheer
Updated: May 6, 2025 • 10:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న దౌర్జన్య నిర్ణయాల నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “నీరు పారకపోతే రక్తం పారుతుంది” అనే తీవ్ర హెచ్చరికలు ఇటీవల చేసిన బిలావల్, ఇప్పుడు భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ అదే సమయంలో, భారత్‌ను విధ్వంసం లేదా శాంతిలో ఒకదానిని ఎంచుకోమంటూ మరోసారి అల్టిమేటం ఇచ్చారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉంటే స్నేహ హస్తంతో రావాలని, కల్పితాలతో కాకుండా వాస్తవాలతో చర్చించాలన్నారు.

శాంతి కోసం చర్చలు

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడిన బిలావల్, శాంతి కోసం చర్చలు అవసరమని పేర్కొనడంతోపాటు, పాకిస్థాన్ ప్రజలు మోకరిల్లే వారికాదని, స్వేచ్ఛ కోసం పోరాడతారని అన్నారు. యుద్ధాన్ని కోరేది కాదని, దేశ గౌరవాన్ని కాపాడే ధైర్యం తమ ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. దీంతో బిలావల్ వ్యాఖ్యలు మరోసారి దూకుడుగా మారాయి. ఓవైపు శాంతి మాట్లాడుతూనే, మరోవైపు హెచ్చరికల వాన కురిపించడం రాజకీయంగా ప్రశ్నార్థకమవుతోంది.

గతంలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు

ఇదే సందర్భంగా బిలావల్, గతంలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిన సంగతి నిజమేనని అంగీకరించారు. అది ఒక దురదృష్టకరమైన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాదం వల్లే బాధపడుతోందని, ఇకపై అలాంటి చర్యలకు తాము ప్రాధాన్యం ఇవ్వబోమని తెలిపారు. బిలావల్ వ్యాఖ్యలతో పాకిస్థాన్ పాలక వర్గాల భిన్న వాదనలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.

Read Also : RTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా

Bilawal Bhutto Zardari Bilawal Bhutto Zardari comments India- Pak War

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.