Bilawal Bhutto Zardari : మొన్న రక్తం అన్నాడు..నేడు శాంతి అంటున్నాడు

Read Time:  1 min
pak Bilawal Bhutto Zardari
pak Bilawal Bhutto Zardari
FONT SIZE
GET APP

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న దౌర్జన్య నిర్ణయాల నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “నీరు పారకపోతే రక్తం పారుతుంది” అనే తీవ్ర హెచ్చరికలు ఇటీవల చేసిన బిలావల్, ఇప్పుడు భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ అదే సమయంలో, భారత్‌ను విధ్వంసం లేదా శాంతిలో ఒకదానిని ఎంచుకోమంటూ మరోసారి అల్టిమేటం ఇచ్చారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉంటే స్నేహ హస్తంతో రావాలని, కల్పితాలతో కాకుండా వాస్తవాలతో చర్చించాలన్నారు.

శాంతి కోసం చర్చలు

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడిన బిలావల్, శాంతి కోసం చర్చలు అవసరమని పేర్కొనడంతోపాటు, పాకిస్థాన్ ప్రజలు మోకరిల్లే వారికాదని, స్వేచ్ఛ కోసం పోరాడతారని అన్నారు. యుద్ధాన్ని కోరేది కాదని, దేశ గౌరవాన్ని కాపాడే ధైర్యం తమ ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. దీంతో బిలావల్ వ్యాఖ్యలు మరోసారి దూకుడుగా మారాయి. ఓవైపు శాంతి మాట్లాడుతూనే, మరోవైపు హెచ్చరికల వాన కురిపించడం రాజకీయంగా ప్రశ్నార్థకమవుతోంది.

గతంలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు

ఇదే సందర్భంగా బిలావల్, గతంలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిన సంగతి నిజమేనని అంగీకరించారు. అది ఒక దురదృష్టకరమైన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాదం వల్లే బాధపడుతోందని, ఇకపై అలాంటి చర్యలకు తాము ప్రాధాన్యం ఇవ్వబోమని తెలిపారు. బిలావల్ వ్యాఖ్యలతో పాకిస్థాన్ పాలక వర్గాల భిన్న వాదనలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.

Read Also : RTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.