📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Murder: యూపీలో భార్య చేతుల్లో భర్త సజీవదహనం

Author Icon By Ramya
Updated: July 29, 2025 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాఘ్‌పత్‌లో భర్తను సజీవదహనం చేసిన భార్య: నలుగురిపై కేసు నమోదు

Murder: ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య అంకిత తన ప్రియుడు అయ్యూబ్ అహ్మద్, మామ సుశీల్, మరియు బేబీ అనే వ్యక్తితో కలిసి భర్త సన్నీని సజీవదహనం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నలుగురిపై కేసు (Case against four people) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Murder: యూపీలో భార్య చేతుల్లో భర్త సజీవదహనం

ఘటన వివరాలు

Murder: కందేరా గ్రామానికి చెందిన సన్నీకి గతేడాది గర్హీ కంగరాన్ గ్రామానికి చెందిన అంకితతో వివాహమైంది. ఈ నెల 22న కావడీ యాత్రలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి సన్నీ బైక్‌పై హరిద్వార్ వెళ్ళాడు. తిరిగి వస్తుండగా, కంగరాన్ గ్రామ రోడ్డు సమీపంలో నలుగురు వ్యక్తులు సన్నీ బైక్‌ను ఆపి అతనిపై దాడి చేశారు.

ఆ తర్వాత నిందితులు సన్నీని అంకిత తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్ళి, అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన సన్నీని (Sunny) మొదట మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ సన్నీ మరణించాడు.

పోలీసుల విచారణ, నిరసనలు

మృతుడి తండ్రి వేద్‌పాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు అంకిత, అయ్యూబ్, బేబీ, సుశీల్‌లపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. దీంతో కందేరా గ్రామస్థులు నిరసనకు దిగారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:  Operation Mahadev: పహల్గాం ఉగ్రవాదులు మావాళ్లే.. అడ్డంగా దొరికిన పాక్

Baghpat Breaking News Crime domesticviolence latest news Murder Telugu News Uttarpradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.