అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తరచూ ఒకే మాట చెబుతున్నారు –భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను నేను తగ్గించాను.ఇక తాజాగా ఆయన ‘ఆపరేషన్ సిందూర్’పై కూడా అదే చెబుతుంటే, ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఆశ్చర్యం( Modi’s silence is surprising) కలిగిస్తోంది.అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్రంగా స్పందించారు.ట్రంప్ పదే పదే ఇదే విషయాన్ని చెబుతున్నా, మోదీ గారు ఒక్క మాట కూడా చెప్పడంలేదు లేదు, అని ఆయన అన్నారు.జైరాం రమేశ్ మాట్లాడుతూ, (Jairam Ramesh said) గత పదకొండు రోజుల్లో ట్రంప్ ఎనిమిదిసార్లు ఇదే వాదన చేస్తున్నారు.అయితే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు, జాతీయ భద్రతా సలహాదారు, ఎవరూ ఖండించలేదు.అమెరికా కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ చెప్పడం సరైనదా? అంటూ ప్రశ్నించారు.
మోదీ మౌనం ఎందుకు? ప్రజలకు స్పష్టత కావాలి
ప్రధాని తరచూ ట్రంప్ను ‘నా మిత్రుడు’ అని పిలిచేవారు.ఇప్పుడు అదే మిత్రుడు ‘ఆపరేషన్ సిందూర్ నా వల్లే ఆగింది’ అంటున్నారు.ఇది నిజం అయితే భారత ప్రజలకు చెప్పాలి, నిజం కాకపోతే ఖండించాలి, అని రమేశ్ డిమాండ్ చేశారు.అంతేకాక, ఇతర దేశాలకు ప్రతినిధులు పంపుతూ మూల సమస్యల నుంచి దృష్టి మళ్లించడమేనంటున్నారు.అసలు ‘ఆపరేషన్ సిందూర్’ ఎందుకు ఆగిపోయింది? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
ట్రంప్ వ్యాఖ్యలు – ద్వంద్వ వాదనా?
ట్రంప్ ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో సమావేశం సందర్భంగా మాట్లాడారు. భారత్, పాకిస్థాన్ మధ్య మేమే పరిస్థితిని చక్కదిద్దాం.వాణిజ్య చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాం.భారత్ నా మిత్రదేశం. మోదీ గొప్ప వ్యక్తి.అలాగే పాకిస్థాన్ నాయకులూ అద్భుతమైనవారే, అని అన్నారు.ఇలా ఇద్దరినీ పొగడటం చూస్తుంటే, ట్రంప్ రెండు పడవల్లో కాలు పెడుతున్నారన్న అభిప్రాయం వస్తోంది.
కాంగ్రెస్ డిమాండ్ – ప్రధాని స్పందించాలి
కాంగ్రెస్ అభిప్రాయం ప్రకారం, భారత ప్రధాని ఇలా మౌనంగా ఉండటం అసమంజసంగా ఉంది.దేశ భద్రత, విదేశాంగ విలువలు, ప్రజల నమ్మకం—all these are at stake.ఇది రాజకీయం కాదు, దేశ గౌరవానికి సంబంధించిన అంశం, అని జైరాం రమేశ్ అన్నారు.ఇది మౌనంగా ఉండే పరిస్థితి కాదని, ప్రధాని నేరుగా స్పందించాలి అని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Turkey : టర్కీకి భారత్ స్ట్రాంగ్ మెసేజ్!