📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నిరుద్యోగులకు ఈ జీరో పన్నుతో కలిగే ప్రయోజనం ఏమిటి? : శశిథరూర్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: February 1, 2025 • 9:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన 75 నిమిషాల బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, ద్రవ్యోల్బం ఊసు ఎత్తలేదెందుకు..? అని ఆయన క్వశ్చన్‌ చేశారు. మధ్య తరగతికి ప్రయోజనం చేకూరేలా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడాన్ని మెచ్చుకుంటూనే.. మరి నిరుద్యోగులకు ఈ జీరో పన్నుతో కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

మీకు ఉద్యోగం ఉండి, ఏడాదికి రూ.12 లక్షల కంటే తక్కువ వేతనం ఉంటే.. సంతోషించదగ్గ విషయమే. మరి నిరుద్యోగుల సంగతేంటి..? అని నొక్కినొక్కి ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలపై పన్నులు తగ్గించడాన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొత్త పన్ను పాలసీతో మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడం మంచి విషయమే. మరి కరెక్టుగా ఆలోచిస్తే.. మీకు వేతనం వస్తున్నట్లయితే మీరు మీరు చెల్లించే గతంలో కంటే తగ్గుతుంది. కానీ నా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. మరి మీకు ఉద్యోగమే లేకపోతే తగ్గిన పన్నుతో ఏం లాభం..? అని ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్‌ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు లేదని, ఎన్నికల్లో పొందే ఓట్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్‌ అని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేశారని విమర్శించారు. ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంశాలను ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. ఆమె పూర్తి ప్రసంగంలో ఎక్కడా ఆ రెండు పదాలు కనిపించకపోవడం విచారకరమని శశిథరూర్‌
అన్నారు.

Congress leader Minister Nirmala Sitharaman Shashi Tharoor unemployed zero tax

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.