West Bengal Crime: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా వ్యవహరించాడు. తన ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి విద్యార్థులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో ఒక విద్యార్థికి గాయాలవ్వగా, బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: AI ImpactSummit: ప్రపంచ AI హబ్గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్కు 80 దేశాల మద్దతు
బంతి తగిలిందని ఆగ్రహం..
వివరాల్లోకి వెళ్తే.. బనిపూర్ గ్రామానికి చెందిన సమీర్ అనే ఉపాధ్యాయుడి ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఆ ప్రాంతానికి చెందిన సుమారు 10 నుండి 12 మంది విద్యార్థులు అక్కడ క్రికెట్, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆటలో భాగంగా బంతి పలుమార్లు సమీర్ ఇంటి తలుపులకు, గోడలకు తగిలింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సమీర్, పిల్లలను మందలించాల్సింది పోయి లోపలి నుండి తుపాకీ తెచ్చి మైదానంలో ఉన్న పిల్లలపై ఏకంగా ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు.
తన ఇంటి పై అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కాల్పులు జరిపాడని ఓ విద్యార్థి మీడియా ప్రతినిధులతో చెప్పాడు. ఒక బుల్లెట్ తన స్నేహితులలో ఒకరికి తగిలిందని చెప్పాడు. స్థానికులు విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించాడు.విషయం తెలియగానే రఘునాథ్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఒమర్పూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: