ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై పలు కీలక అభ్యంతరాలను తమ పార్టీ తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) శనివారం వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత పవిత్రమైందో, అంతే బాధ్యతాయుతంగా దానిని నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత సవరణ విధానం హడావుడిగా, ఏకపక్షంగా, విశ్వసనీయత కోల్పోయేలా జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Bihar Results: ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా స్పందించిన ఆర్జేడీ

ఎపిక్ కార్డును మొబైల్ నంబర్తో అనుసంధానం
వలస కార్మికులు వంటి వర్గాలను సామూహికంగా తొలగించే ముప్పు, ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఎపిక్ కార్డును మొబైల్ నంబర్తో అనుసంధానం చేయడంలోని ఇబ్బందులు, 2002/2005 సర్ రికార్డుల నుంచి ఓటరు సమాచారాన్ని సేకరించడం వంటి సమస్యలను ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. అకారణంగా ఏ తమిళ పౌరుడి ఓటును తొలగించేందుకు వీల్లేదని ఆయన (Vijay) ఈసీ (EC) ని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: