Vijay political : తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ సినీనటుడు, పార్టీ నాయకుడు Vijay ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే శాసనసభ ఎన్నికలు తనకు, తనను అభిమానించే ప్రజలకు ఎంతో భావోద్వేగపూరితమని అన్నారు.
తంజావూరు జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలకు ఇది సాధారణ ఎన్నికలైనా తమకు మాత్రం ఇది భావోద్వేగంతో కూడిన పోరాటమని పేర్కొన్నారు.
Read Also: Madhya Pradesh: విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
క్రీడా పోటీల్లో చెన్నై జట్టుకు అభిమానులు ఊదే విజిల్ మాదిరిగానే ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కూడా మారుమోగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని తెలిపారు.
అధికారంలోకి వస్తే రైతు కుటుంబాలకు విద్యలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెండెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల పిల్లలకు ఉన్నత విద్య ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే ఆ కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదనే నిబంధనను కూడా వివరించారు.
అలాగే మత్స్యకారుల కుటుంబాలకు రక్షణ కల్పిస్తామని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: