బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha)కు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లఖిసరైలో ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను ఉపముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు ఆయన కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్జేడీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు మేము వారి ఛాతీపై బుల్డోజర్ల తో తొక్కిస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు తమ ఏజెంట్లను పోలింగ్ బూత్ల వద్ద బెదిరిస్తున్నారని, బయటకు తోసేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.
Read Also : Bihar: మన సంస్కృతి, విశ్వాసాన్ని పై మహాకూటమికి విశ్వసం లేదు మోదీ

అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. పోలింగ్ బూత్ల వద్ద బీజేపీ ఏజెంట్లను బెదిరించారంటూ వస్తున్న ఆరోపణలను జిల్లా పోలీసు చీఫ్ అజయ్ కుమార్ తోసిపుచ్చారు. అలాంటిది ఏమీ లేదన్నారు. అలా జరిగి ఉంటే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
విజయ్ కుమార్ సిన్హా రాజకీయ జీవితం?
విజయ్ కుమార్ సిన్హా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాలో పని చేసి 2005లో లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2005లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. విజయ్ కుమార్ సిన్హా 2005 నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 25 నవంబర్ 2020 నుండి 24 ఆగస్టు 2022 వరకు బీహార్ శాసనసభ స్పీకర్గా పని చేసి అప్పటి సంకీర్ణ ప్రభుత్వమైన మహాఘ్బంధన్లో అతనిపై అవిశ్వాస తీర్మానం రావడంతో తన పదవికి రాజీనామా చేశాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: