📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Latest News: Vijay: కరూర్‌ తొక్కిసలాట..దర్యాప్తు చేపట్టిన సీబీఐ

Author Icon By Aanusha
Updated: October 27, 2025 • 7:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరూర్‌ (Karur) లో టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ (Vijay) సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసు విచారణను ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా తీసుకుంది. తమిళనాడు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ (CBI) రంగంలోకి దిగింది. గత నెల 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసును ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేపట్టింది.

Read Also: Bihar Elections 2025: సీపీఐ నుంచి బరిలోకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి

అయితే, తమిళనాడు పోలీస్ అధికారులు మాత్రమే ఉన్న సిట్ పై తమకు నమ్మకం లేదంటూ టీవీకే సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించింది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబీఐ) విచారణ బాధ్యతలను అప్పగించాలని కోరింది.

ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల సీబీఐ దర్యాప్తుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాకుండా దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

Vijay

అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో

జస్టిస్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ.. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను తిరిగి నమోదు (రీ-రిజిస్టర్) చేసింది. కేసులో టీవీకే (TVK) జనరల్ సెక్రటరీ బస్సీ ఆనందం,

రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తదితరుల పేర్లను చేర్చింది. స్థానిక కోర్టుకు ఈ మేరకు సమాచారం అందించింది. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధితులు, సంబంధిత కుటుంబాల వాంగ్మూలాలను సేకరించింది. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News CBI karur stampede latest news Telugu News TVK party vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.