📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Breaking News – Karur Stampede : విజయ్ తప్పులేదు.. ప్రభుత్వ వైఫల్యం – అన్నామలై

Author Icon By Sudheer
Updated: September 28, 2025 • 7:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. TVK పార్టీ అధినేత విజయ్ రోడ్‌షో సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, విజయ్‌కు ఎలాంటి తప్పులేదని అన్నామలై పేర్కొన్నారు. “రోడ్‌షో నిర్వహణకు 7గంటల అనుమతి ఎందుకు ఇవ్వాలి? 2గంటలకే అనుమతి ఇచ్చి ఉంటే సరిపోని పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన అన్నారు.

Breaking News – Karur Stampede : ప్రజల ఆర్తనాదాలను విజయ్ పట్టించుకోలేదు-ప్రత్యక్ష సాక్షులు

అన్నామలై (Annamalai) మాట్లాడుతూ..“ఎంతమంది రాబోతున్నారో అంచనా వేసి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం, పోలీసులదే. విజయ్‌పై నిందలు వేయడం కరెక్ట్ కాదు” అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పడాన్ని ఆయన ప్రశ్నించారు. “ఎవరిని విచారణాధికారిగా నియమించాలో సీఎం ముందుగానే చెప్పడం విచిత్రంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

“విజయ్‌పై చెప్పులు విసిరిన ఘటనపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ మొత్తం సంఘటనలో అనేక సందేహాస్పద అంశాలున్నాయి” అని అన్నామలై అన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Annamalai Google News in Telugu karur stampede vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.