గత నెల 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ రక్తసిక్తమైంది.నిష్ఠురంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశాన్ని విషాదంలో ముంచింది.అయితే భారత్ వెనకడుగు వేయలేదు.తక్షణమే ప్రతీకారంగా “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించింది. టార్గెట్గా పీఓకే మరియు పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలు తీసుకుంది.(Indian Army) సున్నితమైన గూఢచర్య సమాచారంతో మెరుపుదాడులు జరిపింది. ఈ ఆపరేషన్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.శత్రుదేశంలోకి ప్రవేశించి బలమైన మెసేజ్ ఇచ్చారు.ఈ దాడులతో పాక్ ఆగ్రహంతో కుప్పకూలింది. వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది.భారత ఆర్మీ స్థావరాలు, జనవాసాలే లక్ష్యంగా టార్గెట్ చేసింది.పాక్ వందలాది డ్రోన్లు, క్షిపణులను భారత్పై ప్రయోగించింది.కానీ మన దేశం ముందుగానే అప్రమత్తమైంది. గగనతల రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి.ఆకాశ్, ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతంగా స్పందించాయి.
వచ్చినవన్నీ గాల్లోనే పేలిపోయాయి.కొన్ని నేలవైపే తిప్పికొట్టబడ్డాయి.ఈ తతంగం అంతా వీడియోల్లో రికార్డ్ అయింది. పాక్ క్షిపణుల శకలాలు పడి ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే పీఓకే దాడుల వీడియోలు భారత ఆర్మీ విడుదల చేసింది. తాజాగా మరో ఆసక్తికర వీడియోను వెస్ట్రన్ కమాండ్ షేర్ చేసింది.వీడియోలో భారత సైన్యం మిస్సైల్ను కచ్చితంగా టార్గెట్ చేస్తూ నేలమట్టం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఊపిరిపీల్చారు.“భారత సైన్యం అగ్ని గోడలా ఉంది” అంటూ పౌరులు వ్యాఖ్యానిస్తున్నారు. శత్రువుల దాడిని అడ్డుకునే సామర్థ్యం మన దగ్గర ఉందన్న గర్వం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.దాడులకు సెకన్ల వ్యవధిలో స్పందించడం భారత ఆర్మీ ప్రత్యేకత. క్షిపణుల దిశలు గుర్తించి వెంటనే కౌంటర్ చర్యలు తీసుకున్నారు.ఈ వీడియోలు ప్రపంచ దేశాలకు భారత రక్షణ శక్తిని చూపించాయి. శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచాయి.
Read Also : Asaduddin Owaisi : పాకిస్థాన్పై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు