నూతన ఉపరాష్ట్రపతి(New Vice President) ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం, తాజాగా రిటర్నింగ్ అధికారి(Returning officer) గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోది(CP Modi)ని నియమించింది. ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్డ్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామ చేశారు. ఆయన రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
న్యాయమంత్రిత్వ శాఖతో సంప్రదించి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సమ్మతితో 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మోదీని రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. రాజ్యసభ సెక్రటేరియట్ జయింట్ సెక్రటరీ గరిమాజైన్, సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్కుమార్లను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది.
16సార్లు ఎన్నికల్లో నాలుగు సార్లే ఏకగ్రీవం
దేశంలో ఇప్పటిదాకా 16సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగ్గా నాలుగుసార్లే ఏకగ్రీవమైంది. మిగిలిన 12సార్లు పోటీ జరిగింది. ఇందులో రెండుసార్లు ఇద్దరికంటే ఎక్కువమంది పోటీ చేశారు. 2022లో కాంగ్రెస్ అభ్యర్థి మూర్గంరెట్ ఆల్వాను ఓడించి జగదీప్ ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారు.
ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని యోచనలో ఇండియా కూటమి ఇండియా కూటమి తమ తరపున ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని యోచన చేస్తున్నట్లు సమాచారం. పార్ల మెంట్లో ఇండియా కూటమికి మెజారిటీ లేకపోయినప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటూ
ఉండడం గమనార్హం. ఫలితంతో సంబంధం లేకకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీల కూటమి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. .
ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎవరు?
జూలై 10, 2025న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 19వ ఎడిషన్ CII-ITC సస్టైనబిలిటీ అవార్డులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్ ప్రసంగిస్తున్నారు.
భారతదేశ ఉపరాష్ట్రపతి పాత్ర ఏమిటి?
భారతదేశంలో, ఉపరాష్ట్రపతి ఉద్యోగం అధ్యక్షుల పదవికి అనుబంధంగా ఉంటుంది, ఎందుకంటే అధ్యక్షుడు అందుబాటులో లేనప్పటికీ, ఉపరాష్ట్రపతి అధ్యక్ష పదవిని భర్తీ చేస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, భారత గణతంత్ర రాజ్యం యొక్క అధికారిక నాయకుడిగా వ్యవహరించడంలో రాష్ట్రపతికి సహాయం చేయడం ఉపరాష్ట్రపతి ఉద్యోగం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Jagdeep Dhankhar: ధన్ఖడ్కు విపక్షాల వీడ్కోలు విందు..దీనిపై