📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Vande Bharat: జనవరి 12 నుండి చెన్నై-నర్సాపురం వందే భారత్ సేవలు ప్రారంభం

Author Icon By Saritha
Updated: November 18, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భీమవరం : దేశంలోనే తొలి సారిగా లూప్ లైన్లో భారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు అనుమతి లభించిందని,(Vande Bharat) 12 నుండి చెన్నై(Chennai) నుండి నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటు లోకి వస్తాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సోమవారం భీమవరంలోని విలేక రుల ఆయన మాట్లాడుతూ చెన్నై నుండి విజయవాడ వరకు నడిచే వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తూ ఉత్త ర్వులు వచ్చిన వారం రోజుల్లోనే ప్రారంభించా లని భావించామని అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఆ రైలుకు ముందస్తు రిజర్వేషన్ల ప్రయాణికులు చేయించుకోవడం వల్ల జనవరి 12 నుండి నర్సాపురం నుండి వందే భారత్ నడపడానికి నిర్ణయించామని కేంద్ర మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలోని తాడేపల్లి గూడెం, భీమవరం, నర్సాపురం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ఇప్పటికే మంజూరైన 95.44 కోట్ల రూపాయల పనులతో పాటు, తాను అదనంగా ప్రతి పాదనలు పంపి మరో 47.31 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించానని శ్రీనివాస వర్మ తెలిపారు.

పైరసీ కేసులో రవి ఇమ్మడి కథ — పోలీసుల విచారణలో ఆసక్తికర వివరాలు

Chennai-Narashapuram Vande Bharat services to start from January 12

భీమవరం–ఆకివీడు స్టేషన్లలో లిఫ్ట్ నిర్మాణ పనులు ఫిబ్రవరిలో పూర్తికానున్నాయి

భీమవరం జంక్షన్, ఆకివీడు రైల్వే స్టేషన్లలో(Vande Bharat) ఫిబ్రవరి చివరి నాటికి లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తవు తాయని తెలిపారు. అలాగే వీరవాసరం, అత్తిలి రైల్వే స్టేషన్లలో కూడా లిఫ్టు నిర్మించాలని ప్రతిపాదన పంపక అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించి నట్లు తెలిపారు. నర్సాపురం నుండి అరుణా చలం వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును రెగ్యులర్ చేయడా నికి రైల్వే అధికారులు అంగీకరించారని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విశాఖపట్నం- వారణాసి ఎక్స్ ప్రెస్ నర్సా పురం వరకు పొడిగింపు, పగటిపూట నర్సాపురం నుండి విశాఖకు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. నర్సాపురం నుండి బెంగ ళూరుకు రెగ్యులర్ రైలు, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్కు తాడేపల్లిగూడెంలో హాల్ట్. ఈ ప్రతిపాదనలన్నీ త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amrit Bharat Station Scheme Bhupathiraju Srinivasa Varma Chennai Narsapuram Train Indian Railways Latest News in Telugu Loop Line Approval Railway Development Telugu News vande bharat express

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.