Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లో అత్యంత విచిత్రమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 1న వివాహం ఒక జంటకు ఊహించని కష్టం వచ్చి పడింది. హోలీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి అత్తారింటికి తీసుకురావడానికి భర్త వెళ్లాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, ఈ ప్రయాణం వారి జీవితంలో ఒక పెద్ద మలుపు తిరుగుతుందని ఆ భర్త ఊహించలేదు.
Read Also: LPG Shortage: గ్యాస్ కష్టాలతో ఆగిపోయిన జొమాటో, స్విగ్గీ డెలివరీలు
మార్గమధ్యంలో ఒక బస్టాండ్లో బస్సు ఆగిన సమయంలో, సదరు భార్య తనకు చాలా ఆకలిగా ఉందని, ఒక ప్లేట్ పకోడి తీసుకురమ్మని భర్తను కోరింది. భార్య మీద ప్రేమతో అతను వెంటనే పకోడి తెచ్చేందుకు వెళ్ళాడు. పది నిమిషాల వ్యవధిలో అతను తిరిగి వచ్చేసరికి, అక్కడ సీటులో కూర్చున్న భార్య కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా, అందరినీ వాకబు చేసినా ఆమె ఆచూకీ లభించలేదు.
అసలేం జరిగిందంటే..!
ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్కు.. రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్జిమ్తో గతేడాది డిసెంబర్ 1వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరు బాగానే కలిసున్నారు. అయితే హోలి పండుగ సందర్భంగా రిమ్జిమ్ తన పుట్టింటికి వెళ్లింది. పండుగ అయిపోవడంతో.. భార్యను ఇంటికి తీసుకురావాలని అత్తారింటికి వెళ్లాడు ప్రీతమ్ సింగ్. అక్కడే వారు చేసిన మర్యాదలన్నీ స్వీకరించి భార్యను తీసుకుని మార్చి 9వ తేదీన తన ఇంటికి బయలుదేరాడు.
మార్గమధ్యంలో మొరాదాబాద్లోని బిలారి బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో రిమ్జిమ్.. తనకు ఆకలిగా ఉందంటూ భర్త ప్రీతమ్ సింగ్కు చెప్పింది.బాగా ఆకలి వేస్తోందని.. తనకోసం ఒక ప్లేటు వేడివేడి పకోడీలు తీసుకురమ్మని కోరింది. దీంతో ప్రీతమ్ పక్కనే ఉన్న స్టాల్ వద్దకు వెళ్లి పకోడీలు ఆర్డర్ ఇచ్చాడు. పదే పది నిమిషాల్లో వేడి వేడి పకోడీలు తీసుకుని భార్య కూర్చున్న చోటుకు వచ్చాడు. కానీ అక్కడ కూర్చుని ఉండాల్సిన రిమ్జిమ్ కనిపించలేదు. మొదట ఆమె ఎక్కడికైనా వెళ్లిందేమో అని బస్టాండ్ అంతా వెతికాడు.
పోలీసులకు ఫిర్యాదు..
అక్కడి వారిని ఆరా తీసినా ఎవరూ ఆమెను చూడలేదని చెప్పారు. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రీతమ్.. వెంటనే పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు.తన భార్య.. ఆమె పుట్టింటి గ్రామమైన ఓ యువకుడితో వెళ్లిపోయి ఉండొచ్చని భర్త ప్రీతమ్ పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ను కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: