యూపీలోని అలీఘర్ జిల్లాలో తన కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ పారిపోయిన వార్త దేశ వ్యప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల స్వప్న అనే మహిళ, తన కుమార్తెకు నిశ్చయించిన రాహుల్ అనే యువకుడితో కలిసి పారిపోయింది. ఈ సంఘటన నైతిక విలువలు, కుటుంబ బంధాలపై సుదీర్ఘ చర్చకు దారితీసింది. తాజాగా స్వప్న, రాహుల్ పోలీసుల ముందుకు వచ్చారు. ఇద్దరూ పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు.
స్వప్న వివరణ –
స్వప్న చెప్పిన ప్రకారం, తన భర్త బాగా తాగి వచ్చి తనను కొట్టేవాడని తన కూతురు కూడా తనతో తరచుగా గొడవలు పడేదని స్వప్న తెలిపింది. అందుకే రాహుల్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, అతనితోనే ఉంటానని తెలిపింది. ఆ గృహంలో నాకు చోటు లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబం చెప్పినట్లు తానేం బంగారం లేదా డబ్బు తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది. నేను తీసుకెళ్లింది నా మొబైల్ ఫోన్, కేవలం రూ. 200 మాత్రమే అని వివరించింది. రాహుల్తో నాకు బంధం ఏర్పడింది. అతడే నాకు భద్రతగా అనిపించాడు. అందుకే అతడిని పెళ్లి చేసుకోవాలనిపించింది అని చెప్పింది.
రాహుల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ, తనపై ఎలాంటి ప్రణయ భావనలు లేవని, కానీ స్వప్న బెదిరించిందని పేర్కొన్నాడు. బస్టాండ్కు రాకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను. ఆ మాటలు విని నేను భయపడ్డాను. తాము తొలుత లక్నోకు వెళ్లామని, అక్కడి నుంచి ముజఫర్నగర్ వెళ్లారని తెలిపాడు. పోలీసులు వెతుకుతున్నారన్న వార్త తెలిసిన వెంటనే మేము తిరిగి వచ్చేశాం. ఇప్పుడు తాను స్వప్నను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని రాహుల్ తెలిపాడు.
కుటుంబ స్పందన –
ఈ వ్యవహారంపై స్వప్న సోదరుడు తీవ్రంగా స్పందించాడు. ఆమెను ఇంటికి తిరిగి రానివ్వం. తీసుకెళ్లిన డబ్బు, బంగారం తిరిగి ఇచ్చేవరకు ఆమెను క్షమించం అని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, స్వప్న తన భర్త చేతుల్లో వేధింపులకు గురైనట్టు చెప్పడం పూర్తిగా అసత్యమని, ఆమె బావ ఒక మంచివాడని చెప్పాడు. ఇది ఆమె కట్టుకథ. అసలు ఆమె గతంలో కూడా కొన్ని అనుమానాస్పద చర్యలు చేసింది. ఈసారి తల్లి గౌరవాన్ని తానే కాలరాస్తోంది అని ఆరోపణలు చేసాడు.
Read also: Uttar Pradesh : యూపీలో దారుణం.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం