కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కుర్చీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కుర్చీపై ప్రత్యేకంగా మనసుపడ్డ ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తన ఆకాంక్షను బహిరంగంగానే వ్యక్తం చేశారు. 2025 సెప్టెంబర్లో బెంగళూరులో “కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ 11వ సదస్సు” జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శాసనసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, కార్యదర్శులతో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Read Also: Railway Budget 2026: రైల్వే రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు
కొత్త కుర్చీ ఏర్పాటు
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కుర్చీపై.. సతీష్ మహానా దృష్టి పడింది. ఆ డిజైన్, శిల్పకళ, వైభవం చూసి ఆకర్షితులయ్యారు. తనకు కూడా ఇలాంటి కుర్చీ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఆయనకు కలిగింది.

ఈ విషయాన్ని నేరుగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్కు తెలియజేయడం విశేషంగా మారింది. దీనిపై స్పందించిన కర్ణాటక స్పీకర్.. మైసూరుకు చెందిన కళాకారులను సతీశ్ మహానాకు పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్న డిజైన్ మార్పులతో కర్ణాటక కుర్చీ నమూనా ఆధారంగానే కొత్త కుర్చీ తయారుచేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: