Latest news: Users: రీఛార్జ్ లు తగ్గించాలని AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి

Read Time:  1 min
Users
Users
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా టెలికాం వినియోగదారుల (Users) అభిప్రాయాలు, అవసరాలు మారుతున్న నేపథ్యంలో, ప్రముఖ కంపెనీలు AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్లలో చాలా వరకు అధిక డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి.

అయితే, పెద్ద సంఖ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లు, WiFi ఆధారిత యూజర్లు (Users) మాత్రం ఈ అధిక డేటా ప్లాన్లను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు. దాంతో, వారు ఉపయోగించని డేటాకు కూడా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది.

Read Also: PAN Card: ఈ పని చేయకపోతే మీ పాన్ రద్దవుతుంది

Users
Users

వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని

ఇలాంటి పరిస్థితిలో, టెలికాం కంపెనీలు వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, వారికి తగ్గట్టుగా ప్లాన్లను ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా, ‘వాయిస్ ఓన్లీ ప్లాన్స్’ లేదా తక్కువ డేటాతో కూడిన ప్లాన్స్‌ కోసం డిమాండ్ పెరుగుతోంది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ,

“ప్రతి నెలా ₹100 లోపు ధరలో కేవలం వాయిస్ కాల్స్ సౌకర్యం కలిగిన ప్లాన్స్ అందించండి. మేము డేటా ఎక్కువగా ఉపయోగించం, కేవలం కాల్స్ కోసం మాత్రమే ఫోన్ వాడతాం. అవసరం లేకపోయినా డేటా ఉన్న ప్లాన్స్ తీసుకోవాల్సి రావడం అనవసరమైన ఖర్చు” అని వ్యాఖ్యానిస్తున్నారు. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.