📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

USA: అమెరికాలో దారుణం..భారతీయ తండ్రీకూతుళ్లపై కాల్పులు

Author Icon By Sharanya
Updated: March 23, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో భారతీయులపై మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఓ దుండగుడు భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను అతి దారుణంగా కాల్చిచంపాడు. ఈ ఘటన వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో గురువారం ఉదయం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యా ఘటన భారతీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

ఎలా జరిగింది?
స్థానిక పోలీసుల వివరాల ప్రకారం, గురువారం ఉదయం వర్జీనియాలోని ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ (56) మరియు ఆయన కుమార్తె ఊర్మి (24) తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ఊర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. స్థానిక పోలీసుల విచారణలో జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ (44 అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతనిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు మద్యం కొనుగోలు చేసేందుకు స్టోర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అతను గత రాత్రి కూడా స్టోర్‌కు వచ్చి మద్యం కొనుగోలు చేయాలని ప్రయత్నించాడని, కానీ షాప్ మూసివేసినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరుసటి రోజు ఉదయం వచ్చిన నిందితుడు, స్టోర్ యజమానిని ప్రశ్నిస్తూ హల్‌చల్ చేశాడు. ఆ తర్వాత తుపాకీ తీసి ప్రదీప్ పటేల్, ఊర్మిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

భారతీయ కుటుంబం – అమెరికాలో వారి జీవితం
ప్రదీప్ పటేల్, ఆయన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ ఆయన తన బంధువు పరేశ్‌ పటేల్కు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. పరేశ్ పటేల్ మాట్లాడుతూ, మా సోదరుడి భార్య, ఆమె తండ్రి షాపులో పనులు చేసుకుంటుండగా ఓ వ్యక్తి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు అని మీడియాకు తెలిపారు. ఈ ఘటన భారతీయ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికాలో భారతీయులకు ఇదే మొదటి ఘటన కాదు. గతంలోనూ ఎన్నో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వర్జీనియా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడు ఒక మతిస్థిమితం లేని చర్యకు పాల్పడ్డాడు. అతని క్రిమినల్ హిస్టరీపై పరిశీలన జరుపుతున్నారు. అయితే ఇది ద్వేషప్రేరిత హత్య, లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది అని పోలీస్ అధికారుల ఒకరు తెలిపారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ దారుణ ఘటనపై అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అధికారిక ప్రకటనలో పేర్కొంది. హతుడు ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ఈ జంట హత్య అమెరికాలోని భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

#CrimeAlert #GunViolence #IndianCommunity #IndianFamilyKilled #IndiansInUS #USA #USNews #VirginiaShooting Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.