📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: UPSC: వందేళ్లు పూర్తి చేసుకున్న ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’

Author Icon By Sushmitha
Updated: November 26, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనదేశానికి రాజ్యాంగం (Constitution) ఎంత ముఖ్యమో యూపిఎస్ సి కూడా అంతే ముఖ్యం. నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) (UPSC) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్స వాలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సమయానికే ఈ వేడుకలను రెండురోజులపాటు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో(New Delhi) భారత మండపంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 

Read also : DK Shivakumar: కర్ణాటకలో సీఎం మార్పుపై తేల్చని కాంగ్రెస్ అధిష్ఠానం

UPSC Union Public Service Commission completes 100 years

ఈ సమావేశాల్లో యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్, సభ్యులు మాత్రమేకాకుండా, అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, మాజీ చైర్మన్లు, మాజీ సభ్యులు, సీనియర్ అధికారులు, నిపుణులు పాల్గొంటున్నారు. శతవార్షికోత్స వాల నేపథ్యంలో ఈ రెండుదినాల సమావేశాలు ఒకవిధంగా దేశవాప్తంగా నియామక వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకునే కీలక చర్యల్లో భాగంగా భావిస్తున్నారు.

సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు..

సామాన్య ప్రజలకు పబ్లిక్ సర్వీస్ (Public service) కమిషన్లు ఇంకా సరళంగా, సులభంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేందుకు ఏవిధమైన మార్పులు కావాలి అనే దానిపై లోతైన చర్చ జరగనుంది. పబ్లిక్ సేవలకు చేరాలనుకు అభ్యర్థులకు మరింత న్యాయం జరిగేలా, వ్యవస్థ మరింత ఆధునికంగా ఉండేలా చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం.

ఈ చింతన్ సమావేశాల్లో పాలనాపరమైన సేవలు, నైతకత, పారదర్శకత, సుపరిపాలన వంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి టెక్నాలజీ వేగంగా మూరుతున్న నేపధ్యంలో సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, పరీక్షా విధానాల్లో లేదా ఎంపిక ప్రక్రియల్లో వాటి ప్రభావం ఎంత ఉంటుంది అనే విషయాలు కూడా ఇందులో చర్చకు వస్తాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

100 years anniversary; Civil services Google News in Telugu governance milestone. Indian bureaucracy Latest News in Telugu Telugu News Today Union Public Service Commission UPSC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.