UPSC clarification rank : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026లో 301వ ర్యాంకుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళానికి యూపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు ర్యాంకు తమదేనని ప్రకటించుకోవడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసలు విజేత ఎవరంటే
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన ఆకాంక్ష సింగ్నే అసలైన 301వ ర్యాంకర్గా యూపీఎస్సీ ప్రకటించింది. దీంతో ఈ వివాదానికి తెరపడింది.
ఇద్దరు అభ్యర్థులతో గందరగోళం
సివిల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత ఘాజీపూర్కు చెందిన ఆకాంక్ష సింగ్తో పాటు బిహార్లోని అరాకు చెందిన మరో ఆకాంక్ష సింగ్ కూడా 301వ ర్యాంకు సాధించానని ప్రకటించారు. ఇద్దరూ తమ అడ్మిట్ కార్డులు చూపిస్తూ మీడియా ముందు మాట్లాడడంతో గందరగోళం నెలకొంది.
Read Also: KCR Iftar Tradition: 35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో అసలు అభ్యర్థి స్పందన
ఘాజీపూర్కు చెందిన ఆకాంక్ష సింగ్ తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ర్యాంకును నిరూపించే పత్రాలు కూడా పంచుకున్నారు. మరోవైపు బిహార్కు చెందిన అభ్యర్థి కూడా ఈ ర్యాంకు తనదేనని వాదించారు.
ఇక ఈ వివాదంపై స్పష్టత ఇచ్చిన యూపీఎస్సీ ప్రకటనతో అసలు విజేతపై ఉన్న సందేహాలకు తెరపడింది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: