“లివ్-ఇన్ సంబంధాల నుంచి అమ్మాయిలు దూరంగా ఉండాలి” – గవర్నర్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్(UP) గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మరోసారి లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తన ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలు ఇలాంటి సంబంధాల నుంచి దూరంగా ఉండాలని ఆమె సూచించారు. లేకపోతే భాగస్వాముల చేతుల్లో దారుణ హత్యలకు గురవుతున్న ఘటనలు చూస్తున్నామని, ఇవి ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.
Read also: టీసీఎస్లో భారీ నష్టాలు ఉద్యోగుల తొలగింపులు, పునర్నిర్మాణ
ఆనందీబెన్ పటేల్(Anandiben Patel) వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ 47వ స్నాతకోత్సవంలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. “ఇప్పటి యువతలో లివ్-ఇన్ రిలేషన్లు ఒక ఫ్యాషన్గా మారాయి. కానీ, దయచేసి దానికి దూరంగా ఉండండి” అని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో భాగస్వాముల మధ్య హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని, అవి తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని చెప్పారు.
అవగాహన కార్యక్రమాలపై దృష్టి
ఉత్తర్ ప్రదేశ్(UP) గవర్నర్ఆనందీబెన్ పటేల్ మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలపై ఒక న్యాయమూర్తి కూడా ఆందోళన వ్యక్తం చేశారని, యువతను రక్షించేందుకు విశ్వవిద్యాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇది ఆమె లివ్-ఇన్ రిలేషన్లపై చేసిన రెండవ వివాదాస్పద వ్యాఖ్య. కొద్ది రోజుల క్రితం బలియాలోని జననాయక్ చంద్రశేఖర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
“లివ్-ఇన్ పరిణామాలు చూడాలంటే అనాథాశ్రమాలకు వెళ్లండి”
బలియాలో చేసిన ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, “లివ్-ఇన్ రిలేషన్ల పరిణామాలు తెలుసుకోవాలంటే అనాథాశ్రమాలను చూడండి. అక్కడ 15–20 ఏళ్ల అమ్మాయిలు ఏడాది వయసున్న పిల్లలతో కనిపిస్తారు” అని వ్యాఖ్యానించారు.
అదే వేదికపై యువత డ్రగ్స్ బానిసత్వం గురించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆనందీబెన్ పటేల్ ఎక్కడ వ్యాఖ్యలు చేశారు?
వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ స్నాతకోత్సవంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఏ విషయంపై హెచ్చరించారు?
లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాల ప్రమాదాలపై అమ్మాయిలను హెచ్చరించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: