📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

మృతులకు పరిహారం ప్రకటించిన యూపీ ప్రభుత్వం

Author Icon By sumalatha chinthakayala
Updated: January 30, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను డీఐజీ మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకట్రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని.. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు. తొక్కిసలాట ఘటనలో 60 మంది గాయపడ్డారని డీఐజీ చెప్పారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని.. వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1920ను సంప్రదించాలని డీఐజీ సూచించారు.

మృతులకు ₹25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతులకు యూపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఈ అంశాన్ని దర్యాప్తు చేసి.. నిర్ణీత కాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే సీఎస్‌, డీజీపీ స్వయంగా ఒకసారి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆయా అంశాలను పరిశీలిస్తారని తెలిపారు.

కాగా, మౌని అమావాస్య కావడంతో బుధవారం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య రోజున అమృత స్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటంతో కొందరు బారికేడ్లను బద్దలు కొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. మరోపక్క మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

CM Yogi Adityanath compensation Maha Kumbh Mela Prayagaraj

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.