ఉత్తరప్రదేశ్ (UP) ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మానవ వనరుల (Human Resource) పోర్టల్లో తమ ఆస్తి వివరాలను అప్లోడ్ చేయని 68,236 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ కఠిన నిర్ణయం అమలు చేసింది. ఆస్తుల వివరాలు సమర్పించే వరకు ఒక్క రూపాయి కూడా జీతం విడుదల చేయబోమని స్పష్టంగా ప్రకటించింది. జనవరి 31 గడువు ఇచ్చినా పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడో, నాల్గో కేటగిరీలతో పాటు తొలి రెండు కేటగిరీల ఉద్యోగులూ ఉన్నారు. పారదర్శకత, అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Also: Budget 2026 Cheaper Items: సామాన్యుడికి నిర్మలమ్మ బంపర్ ఆఫర్లు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: