ఉత్తరప్రదేశ్లోని (UP Crime) ఘజియాబాద్ సిస్టర్స్ సూసైడ్, కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. కొరియన్ ఆన్లైన్ గేమ్కు (Korean online game) బానిసైన నిషిక (16), ప్రాచి (14), పఖీ (12) బుధవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు కొరియన్ అంటే చాలా ఇష్టమని, సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Elon musk: కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కొరియన్ అంటే ప్రాణం
ఆత్మహత్యకు పది రోజుల ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తండ్రి డిలీట్ చేశారు. వీరు ముగ్గురు మరియా, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో ఖాతాలను తెరిచారు. (UP Crime) ఇంట్లో కూడా వారు అవే పేర్లతో పిలుచుకునేవారు. ఇటీవల తండ్రి ఆ ఖాతాలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.వారి వద్ద నుంచి తండ్రి మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని పోలీసులు తెలిపారు. తమకు కొరియన్ అంటే ప్రాణమని, ఈ విషయం మీకు అర్థం కాదని, ఇక్కడి వాళ్లను మేం పెళ్లి చేసుకోలేమని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: