ఆధార్ ఉపయోగదారుల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్కు లింక్(Aadhaar link) అయిన మొబైల్ నంబర్ను మార్చుకోవడానికి సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ఆన్లైన్లోనే అప్డేట్(online update) చేసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తేవనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ సదుపాయం వల్ల ప్రజలు తీసుకునే సమయం, క్యూలలో నిలబడే ఇబ్బంది గణనీయంగా తగ్గనుంది.
Read Also: Fake Aadhaar: ఏఐతో నకిలీ ఆధార్–పాన్: గుర్తింపు ధృవీకరణకు సవాల్
ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి
ఈ కొత్త ఫీచర్ గురించి UIDAI సోషల్ మీడియా వేదిక ‘X(Twitter)’ ద్వారా వివరాలు అందించింది. వినియోగదారులు OTP ధృవీకరణతో పాటు ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి తమ మొబైల్ నంబర్ను సులభంగా మార్చుకోవచ్చని తెలిపింది. ఈ సేవ mAadhaar యాప్లో భాగంగా అందుబాటులో ఉంటుందని, ఆండ్రాయిడ్ మరియు iOS ఇద్దరిలోనూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రస్తుతం ఆన్లైన్లో కేవలం చిరునామా మార్పు చేసే అవకాశమే ఉండగా, మొబైల్ నంబర్ సహా ముఖ్యమైన వివరాలను మార్చుకోవడానికి కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్(Boimetric) ఇవ్వాల్సి వస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ అవుతుంది. అలాగే ఈ ఫీచర్ను ముందుగా ప్రయోగాత్మకంగా పరీక్షించదలిచిన వారు తమ అభిప్రాయాలను ఈమెయిల్ ద్వారా పంపవచ్చని UIDAI కోరింది.
భవిష్యత్తులో మరిన్ని ఆధార్ వివరాలను కూడా మొబైల్ నుంచే అప్డేట్ చేసుకునేలా ఒక అధునాతన, సురక్షిత యాప్ను రూపొందించే పనిలో UIDAI ఉన్నారని అధికారులు తెలిపారు. ఇది స్మార్ట్ఫోన్లలో ఉన్న ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసి, బయోమెట్రిక్ ఆధారాన్ని మరింత తగ్గించనున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: