Bank Unions Strike: వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె అమలైతే బ్యాంకింగ్ సేవలు (Banking services) తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read also: BhakraNangal: 75 ఏళ్లుగా ఉచితంగా నడుస్తున్న భారతదేశపు ఏకైక రైలు

జనవరి 27న బ్యాంకుల బంద్
ఇప్పటికే జనవరి 25న సాధారణ వారపు సెలవు, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండటంతో, 27న జరగనున్న సమ్మెతో కలిపి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చెక్కుల క్లియరెన్స్, నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, కౌంటర్ సేవలు వంటి కీలక బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోవచ్చు. బ్యాంకింగ్ సేవలను నిత్యం వినియోగించే వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ముందుగానే తమ అవసరమైన లావాదేవీలను పూర్తిచేసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా నగదు ఉపసంహరణలు, ముఖ్యమైన చెల్లింపులు, బిల్లుల సెటిల్మెంట్లు (Bills settlements) ఆలస్యం కాకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల పని భారం తగ్గించడం, వృత్తి–వ్యక్తిగత జీవన సమతౌల్యం మెరుగుపరచడమే ఈ డిమాండ్ వెనుక కారణమని యూఎఫ్బీయూ నేతలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా, స్పష్టమైన హామీ లభించలేదని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై సానుకూల స్పందన లేకపోతే భవిష్యత్తులో మరింత ఆందోళనాత్మక కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నట్లు యూనియన్లు హెచ్చరించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: