📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Vijay Mallya: ఆర్సీబీ జట్టుకు అభినందనలు తెలిపిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్!

Author Icon By Anusha
Updated: March 23, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. 18వ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి) జట్ల మధ్య జరగగా, ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గత కొన్ని సీజన్లలో కేకేఆర్ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పొందిన బెంగళూరు, ఈసారి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రతీకారం తీర్చుకుంది.

మ్యాచ్ హైలైట్స్

టాస్ ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా, 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే బెంగళూరు బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కేకేఆర్‌కు పెద్ద స్కోరు చేయనివ్వలేదు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (56) విరాట్ కోహ్లీ (59 నాటౌట్) ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలిసి 95 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు కెప్టెన్ రజత్ పాటిదార్ 34 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

ఫ్యాన్స్ సంబరాలు

బెంగళూరు తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. “ఈసారి కప్పు మాదే” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చూపించడంతో, ఆయన అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. కోహ్లీ 59 పరుగులు చేశాడు.

విజయ్ మాల్యా పోస్ట్

కేకేఆర్‌పై విజయం సాధించిన సందర్భంగా ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. “ఆర్సీబీకి టాప్ క్లాస్ ప్రదర్శన అందించినందుకు అభినందనలు. బెంగళూరు బౌలింగ్‌ను ప్రశంసించడం ముద్దుగా అనిపిస్తోంది. వారి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ ఆయన ప్రశంసలు గుప్పించారు.

ట్రోలింగ్

ఈ ట్వీట్ చేసిన వెంటనే నెటిజన్లు విజయ్ మాల్యాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కొందరు “భారత్‌కు రా”, “తిరిగి డబ్బులు ఎప్పుడు ఇస్తావ్?” అంటూ సెటైర్లు వేశారు. 2016లో 17 భారతీయ బ్యాంకుల నుంచి రూ. 9000 కోట్ల రుణం తీసుకుని దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్నారు.ఆయనను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.ఐపీఎల్ 2025 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమై, తొలి మ్యాచ్‌ నుంచే ఉత్కంఠను పెంచింది. ఆర్సీబీ తమ బలాన్ని ప్రదర్శించగా, కోల్‌కతా తమ మొదటి మ్యాచ్‌లో విఫలమైంది. ఈ సీజన్ ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, రాబోయే రోజుల్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.

#CricketFever #IPL2025 #IPLOpeningMatch #KKRvsRCB #PhilSalt #RajatPatidar #RCBvsKKR #RCBWin #VijayMallya #ViratKohli Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.