బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో (In Gaya district of Bihar state) శాంతియుతంగా ప్రారంభమైన ఒక పర్యటన, క్షణాల్లో భయంకరమైన అనుభవంగా మారింది. లంగురియా (Languria Waterfall) కొండ వద్ద ఉన్న జలపాతాన్ని వీక్షించేందుకు వెళ్లిన ఆరుగురు మహిళలు, ఊహించని వరద ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది.ఆదివారం ఉదయం వాతావరణం చక్కగా ఉండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో జలపాతాన్ని వీక్షించేందుకు వచ్చారు. ఆరుగురు మహిళలు నీటిలో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కానీ అచేతనంగా ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం గట్టిగా రావడంతో పరిస్థితి భయానకంగా మారింది. మిగిలిన వారు బయటకు పరుగులు పెట్టినా, ఆ ఆరుగురు మాత్రం మధ్యలోనే చిక్కుకుపోయారు.
గ్రామస్థుల సాహసోపేత రక్షణ ప్రయత్నం
ఈ ఘటనను గమనించిన స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్లి మొదట మహిళలలో ఒకరిని రాయిపై నుంచి రక్షించారు. కానీ అదే సమయంలో ముగ్గురు మహిళలు నీటి ఉధృతిలో పడిపోయారు. వారు లోయలోకి కొట్టుకుపోతున్న సమయంలో గ్రామస్థులు కష్టం మీద వారిని బయటికి లాగారు.
ఆఖరి మహిళను కూడా రక్షించిన దృశ్యం
మిగతా ఇద్దరిని కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిన గ్రామస్థులు చివరికి జలపాత మధ్య ఒంటరిగా మిగిలిన ఆరవ మహిళను కూడా రక్షించగలిగారు. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడగా, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వైరల్గా మారిన వీడియో… భయపెట్టిన దృశ్యాలు
ఈ రక్షణ సంఘటనను అక్కడి కొందరు మొబైల్ కెమెరాల్లో బంధించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా పాకింది. జలపాతంలో ఇంతటి ఉధృతిని ఎప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు.
Read Also : Horse Riding: బెజవాడ యువతలో గుర్రపు స్వారీపై పెరుగుతున్న క్రేజ్