📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : TR Balu : బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

Author Icon By Sudha
Updated: December 5, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఉన్న తిరుపుండ్రం కొండ‌పై కార్తీక దీపాన్ని వెలిగించ‌కుండా స్థానిక ప్ర‌భుత్వం భ‌క్తుల‌ను అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ఆ అంశంపై ఇవాళ లోక్‌స‌భ‌లో దుమారం చెల‌రేగింది. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆల‌య శిఖ‌రంపై ప్ర‌తి ఏడాది త‌ర‌హాలో కార్తీక దీపాన్ని వెల‌గించేందుకు వెళ్లిన భ‌క్తుల‌ను ఎందుకు అడ్డుకున్నార‌ని బీజేపీ నిల‌దీసింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను డీఎంకే నేత టీఆర్ బాలు (TR Balu)ఖండించారు. త‌మిళ‌నాడులో బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న‌ద‌ని టీఆర్ బాలు (TR Balu)ఆరోపించారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర మంత్రి ఎల్ మురుగ‌న్ కొట్టిపారేశారు. ఆరాధించే హ‌క్కును త‌మిళ‌నాడు స‌ర్కారు నొక్కిపెడుతోంద‌న్నారు.

Read Also: http://Simone Tata: లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

TR Balu

తిరుపుండ్రం కొండ‌పై వెలిగించే కార్తీక దీపం అంశాన్ని లేవ‌నెత్తేందుకు డీఎంకే స‌భ్యులు ఇవాళ లోక్‌స‌భ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని వాయిదా వేశారు. ఇదే అంశాన్ని మ‌ళ్లీ జీరో అవ‌ర్‌లో లేవ‌నెత్తారు. తిరుపుండ్రం కొండ‌పై కార్తీక దీపాన్ని వెలిగించ్చుకోవ‌చ్చు అని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. దాన్ని త‌మిళ‌నాడు స‌ర్కారు వ్య‌తిరేకిస్తున్న‌ది. కొండ‌పై దీపాన్ని ఎవ‌రు వెలిగించాలి, హిందూ దేవాదాయ‌శాఖ బోర్డు స‌భ్యులా లేక హైకోర్టు జ‌డ్జి తీర్పును ప‌ట్టుకుని తిరుగుతున్న‌వాళ్లా అని బాలు అడిగారు. జ‌డ్జి ఐడియాల‌జీతో తీర్పు ఇచ్చిన‌ట్లు ఆయ‌న కామెంట్ చేయ‌డాన్ని కేంద్ర మంత్రి మురుగ‌న్ త‌ప్పుప‌ట్టారు. పూజా హ‌క్కును త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అణిచివేసింద‌ని మంత్రి ఆరోపించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BJP BreakingNews DMK latest news Politics Religious Tensions Telugu News TR Balu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.