📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tourist Killing : నా భర్తను కళ్లెదుటే కాల్చివేశారు : భరత్ భూషణ్ భార్య

Author Icon By Divya Vani M
Updated: April 24, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్ పర్యాటక కేంద్రమైన పహల్గాం మరోసారి తీరని విషాదానికి సాక్షిగా మారింది.అందాల లోయగా పేరుగాంచిన బైసరన్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.ఈ హృదయ విదారక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భరత్ భూషణ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు.తన మూడేళ్ల కుమారుడిని చూపించి ప్రాణాలు కాల్చివేశారు, ఉగ్రవాదులు కనికరం చూపకపోవడం అందరి గుండెను తాకుతోంది.సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు.వారు ఎంత సమీపంలో ఉన్నారంటే, దాక్కునే అవకాశం కూడా లేకుండా పర్యాటకులను చుట్టుముట్టారు. భయంతో పరుగులు తీసిన వారి అరుపులు ఆ అందమైన లోయను గుండెల్లో కొట్టినట్టుగా మార్చేశాయి.ఈ ఉగ్రదాడిని త‌న ముండే సుజాత, తన భర్తను కోల్పోయిన ఆ క్షణాలను కన్నీటి ముడితో గుర్తు చేసుకున్నారు. “ఏప్రిల్ 18న విహారయాత్ర కోసం పహల్గాం వెళ్లాం. గుర్రాలపై బైసరన్ చేరుకున్నాం. మా బాబుతో ఆడుకుంటూ, ఫోటోలు దిగుతుండగానే… తుపాకీ శబ్దాలు మొదలయ్యాయి” అని తెలిపారు.

Terrorist Attack పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదుల గుర్తింపు

మొదట జంతువుల శబ్దాలేమో అనిపించిందట, కానీ ఆ శబ్దాలు సమీపించడంతో దాడి గమనించి భయంతో నిశ్చలమయ్యామని చెప్పారు.”మైదానం ఎటు చూసినా విస్తారంగా ఉంది. దాక్కునే చోటు లేదు. మా కళ్ల ముందే వారు ఒక్కొక్కరిని బయటికి లాగి, కాల్చారు. ఒక వ్యక్తిని తలపై రెండు సార్లు కాల్చిన దృశ్యం ఇప్పటికీ మరిచిపోలేను” అంటూ సుజాత వేదన వెల్లిపోసారు. ఉగ్రవాదుల్లో ఒకడు అన్న మాట – “మా పిల్లలు బాధపడుతుంటే మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?” – ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతుందంటూ కన్నీరు పెట్టుకున్నారు.తన భర్త భరత్ భూషణ్ చివరిసారి ఉగ్రవాదిని చూసి, “నా బాబు చిన్న వాడే… దయ చేసి వదిలేయండి” అని ఎంతగా వేడుకున్నా, ఉగ్రవాది ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల్చేశాడని ఆమె శోకంతో చెప్పారు. కళ్లెదుటే తన భర్త ప్రాణాలు కోల్పోవడం చూసిన ఆ క్షణం, సుజాత జీవితాంతం మరిచిపోలే దుర్విపాకంగా మిగిలింది.ఈ ఘటనలో మృతి చెందినవారికి సానుభూతి తెలుపుతూ దేశమంతా శోకసాగరంలో మునిగిపోయింది. పర్యాటకులు కూడా భద్రత కింద విహరించలేని పరిస్థితి జమ్ముకశ్మీర్‌లో నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన మానవత్వంపై మచ్చ వేసిన ఘనకారం.

Read Also : Pakistan Navy: అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ నావికాదళం విన్యాసాలు

BaisaranValleyShooting BharatBhushanFamily JammuKashmirTerrorAttack PahalgamTragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.