ఫిబ్రవరి రెండో వారంలో వచ్చే సెలవులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) ప్రయాణికుల కోసం ప్రత్యేక టూరిజం(Tour) ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. సామాన్యులకు అనుకూలంగా ఉండేలా ఈ పర్యటనలను తక్కువ ఖర్చుతో రూపొందించారు.
Read Also:TTD: పరీక్షల వేళ భారీగా తగ్గిన భక్తుల రద్దీ

ఈ ప్యాకేజీల్లో భాగంగా, కేవలం రూ.3,500తో గోవా, హంపి, తుల్జాపూర్ ప్రాంతాలను కవర్ చేసే నాలుగు రోజుల, మూడు రాత్రుల పర్యటనను(Tour) ఏర్పాటు చేశారు. అదే విధంగా, రూ.3,000 ఖర్చుతో మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు — పంధర్పూర్, గంగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ — దర్శించుకునే ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టారు. ఈ అన్ని టూరిజం ప్యాకేజీలు హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతాయి. సెలవుల్లో కుటుంబంతో కలిసి పర్యటన లేదా ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి ఇవి మంచి అవకాశంగా టీజీఎస్సార్టీసీ పేర్కొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: