📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kejriwal: నేటి పాలకులు బ్రిటిష్ కంటే దారుణంగా ఉన్నారు: కేజ్రీవాల్

Author Icon By sumalatha chinthakayala
Updated: March 24, 2025 • 8:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kejriwal: బీజేపీపై మరోసారి ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌, సంఘ సంస్కర్త అంబేడ్కర్‌ వారసత్వాన్ని కాషాయపార్టీ విస్మరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు బ్రిటిష్‌ వాళ్ల కంటే దారుణంగా ఉందన్నారు. ‘ఏక్‌ శామ్‌ షహీదోంకే నామ్‌’ పేరుతో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కేజ్రీవాల్‌.. తమ పార్టీ మాత్రం భగత్‌సింగ్‌, అంబేడ్కర్‌ల ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చిందన్నారు.

గాంధీజీ చిత్రపటం లేదు

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, భగత్‌ సింగ్‌లు మాకు ఆదర్శం. మా కార్యాలయంతోపాటు పంజాబ్‌లోని ప్రతి ఆఫీసులో వారి ఫొటోలే ఉంటాయి. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఫొటోలను తొలగించి వారికి నచ్చిన వాళ్లవి పెట్టుకున్నారు. గాంధీజీ చిత్రపటం లేదని విమర్శించిన కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు మౌనంగా ఉంది. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రస్తుత పాలకులు బ్రిటిష్‌ కంటే దారుణంగా ఉన్నారని మండిపడ్డారు.

ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సింది

ఢిల్లీలో బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకుంటే కండక్టర్లు పింక్‌ టికెట్‌ ఇవ్వడం లేదన్నారు. సౌకర్యాలు కల్పించకపోగా.. గతంలో ఉన్న వాటిని ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సి ఉందని, కానీ ఇంకా ఆ కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

AAP BJP Breaking News in Telugu British Google news Google News in Telugu Kejriwal Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.