రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో కార్లలో అమర్చిన ఎయిర్బ్యాగ్లు ఒక విషాద ఘటనకు కారణమయ్యాయి. తమిళనాడులోని(Tamil Nadu) తిరుప్పోరూర్(Tirupporur) సమీపంలోని పాత మహాబలిపురం రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. కల్పక్కంకు చెందిన ఆనందన్ తన కుమారుడు కవిన్తో కలిసి అక్టోబర్ 15, 2025న కారులో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి మరొక వాహనం ఢీకొట్టింది.ఢీ కొనడంతో ఎయిర్బ్యాగ్ ఆకస్మాత్తుగా తెరుచుకుని ముందుసీట్లో ఉన్న చిన్నారి కవిన్ ముఖాన్ని ఢీకొట్టింది.ఫలితంగా, బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Read also: Yarlagadda Venkatrao: గూగుల్ ఏపీకి గేమ్ ఛేంజర్ : ఎమ్మెల్యే యార్లగడ్డ
పోలీసుల కేసు నమోదు – విచారణ కొనసాగుతోంది
ఘటనపై సమాచారం అందుకున్న తిరుప్పోరూర్(Tirupporur) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రాణాలను కాపాడాల్సిన భద్రతా పరికరం ఈ విధంగా ప్రమాదానికి కారణమవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనతో కార్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎయిర్బ్యాగ్లు ఎలా పనిచేస్తాయి?
ప్రమాదం సంభవించినప్పుడు కారులోని సెన్సార్లు ఢీకొన్న వైబ్రేషన్ను గుర్తించి, ఎయిర్బ్యాగ్ వ్యవస్థకు సిగ్నల్ పంపుతాయి.అప్పుడు గ్యాస్ ఇన్ఫ్లేటర్ పనిచేసి ఎయిర్బ్యాగ్ను తక్షణమే గాలితో నింపుతుంది.దీంతో ప్రయాణికుల తల, ఛాతీ, ముఖం వంటి భాగాలు స్టీరింగ్ లేదా డ్యాష్బోర్డ్ను ఢీకొనకుండా రక్షితంగా ఉంటాయి.అయితే, ఈ ఘటనలో ఆ వ్యవస్థ తప్పుగా స్పందించడంతో ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిన విషాదం చోటుచేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: