Tirumala Laddu controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించి దాఖలైన మరో పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించి రాజకీయ నేతల వ్యాఖ్యలపై సీబీఐ (CBI) ఎలాంటి విచారణ జరపడం లేదని పిటిషనర్ మానూరు శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read Also : Tirumala Dollars: ఆన్లైన్లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం!

సీబీఐ విచారణకే మొగ్గు!
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. లడ్డూ కల్తీ అంశంపై ఇప్పటికే తాము అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఆ తర్వాతే సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయని, ఈ దశలో అదనపు ఆదేశాలు అవసరం లేదని అభిప్రాయపడింది.
పిటిషనర్కు ఏవైనా అభ్యంతరాలు లేదా అదనపు సమాచారం ఉంటే, వాటిని నేరుగా సీబీఐ అధికారులకే తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరైనది కాదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో లడ్డూ కల్తీ కేసులో కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ యథావిధిగా కొనసాగనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :