📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

ఢిల్లీ గణతంత్ర వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత

Author Icon By Vanipushpa
Updated: January 25, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పందించిన డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా.. 6 అంచెల సెక్యూరిటీ చెకింగ్స్ ఏర్పాటు చేశామని, ముఖ్యమైన ప్రదేశాలలో వీడియో కెమెరాలు, వీడియో అనలిటిక్స్, ఎఫ్ఆర్ఎస్మ ల్టీలేయర్ బారికేడింగ్ సిస్టమ్ ను సిద్ధంగా ఉంచామన్నారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరిస్తారని చెప్పారు.

భారీ బందోబస్తు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా చెప్పారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఢిల్లీలో వేలాది సీసీటీవీలు, కెమెరాలు ఇన్ స్టాల్ చేశామన్నారు. వీటిల్లో కొన్ని కెమెరాల్లో వీడియో అనలిటిక్ ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు. నేరస్థులు, వాంటెడ్ టెర్రరిస్టుల డేటాబేస్ ను సులభంగా గుర్తించేలా సీసీటీవీలో వివరాలను పొందుపర్చామని, వారికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కదలికలు కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్‌లు, పోలీసు సిబ్బందికి హెచ్చరికలు అందుతాయని డీసీపీ తెలిపారు. దాంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చేప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా అధ్యక్షుడుఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ కి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరుకానున్నారు. ఆయన జనవరి 23 నుండి జనవరి 26 వరకు భారతదేశంలోనే ఉంటారు. ఆయన పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌, ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖర్‌తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, దేశాధ్యక్షుడు ద్రౌపది ముర్ముతో కూడా ఆయన సమావేశం కానున్నారు.

delhi republic celebrations tight security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.