గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Ex CM VIjay Rupani) మరణం పట్ల ఇప్పుడు విషాదకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ రూపానీ తొలుత తన లండన్ ప్రయాణానికి మే 19న విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ టికెట్ను చివరి సమయంలో రద్దు చేసుకున్నారు. అలాగే జూన్ 5న మళ్లీ లండన్ ప్రయాణానికి టికెట్ తీసుకుని మరోసారి ప్రయాణాన్ని పూర్తిగా విరమించుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో ప్రయాణం రద్దవడం ఓ యాదృచ్ఛికత అనిపించవచ్చు కానీ మూడోసారి మాత్రం విషాదాంతం (AIr india plane crash) చోటు చేసుకుంది.
మూడోసారి ప్రయాణమే విషాదాంతం
జూన్ 12న విజయ్ రూపానీ చివరికి లండన్ వెళ్లే ఉద్దేశంతో విమానంలో ఎక్కారు. అదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నా, ఇప్పటికే ఇంజిన్ ఫెయిల్యూర్, సాంకేతిక లోపాలు వంటి అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదం ఆయన కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. గత రెండు ప్రయాణాలే సురక్షితంగా ఉండగా, మూడోసారి మాత్రం విమానం పయనమే చివరైపోయింది.
దురదృష్టకర ప్రయాణం
విజయ్ రూపానీ రాజకీయంగా సుస్థిర గుర్తింపు పొందిన నాయకుడు. గుజరాత్ను అభివృద్ధి పథంలో నడిపించిన నేతగా పేరు తెచ్చుకున్న ఆయన ఇలా అనూహ్యంగా మరణించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో విషాదాన్ని నింపింది. అతని ప్రయాణాల నేపథ్యం చూసిన వారంతా ఇది ఓ దురదృష్టక సంయోగంగా భావిస్తున్నారు. మొదటి రెండు అవకాశాల్లో అతను ప్రయాణం చేయకపోవడం ఒక వరంగా కనిపించగా, మూడోసారి మాత్రం అది ఆయుష్కాలం ముగిసిన ఘడియగా నిలిచిపోయింది.
Read Also : Thalliki Vandanam : ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం – మంత్రి లోకేశ్