📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Cancer Patients : ఈ ట్రైన్ అంత క్యాన్సర్ రోగులే..!

Author Icon By Sudheer
Updated: June 21, 2025 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ రైల్వే మానవతా విలువలకు నిలువెత్తు ఉదాహరణగా, క్యాన్సర్ బాధితుల (Cancer Patients)ప్రయాణానికి ప్రత్యేకంగా ఓ రైలు(Train)ను నడుపుతోంది. ఈ రైలు ప్రతి రోజు రాత్రి 9:20 గంటలకు పంజాబ్‌లోని బటిండా నుండి రాజస్థాన్‌లోని బికనీర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రయాణించే వారిలో అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులే ఉంటారు. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, బాధితులకు ఆశాదీపంగా మారింది.

రసాయన వ్యవసాయానికి చేదు ఫలితాలు

పంజాబ్‌లోని మల్వా ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి కోసం విస్తృతంగా రసాయనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడి, ఆ ప్రాంతంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరిగాయి. రసాయనిక పురుగు మందులు, ఎరువుల ప్రభావంతో వందలాది మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. చికిత్స కోసం బికనీర్‌లో ఉన్న ఆసుపత్రులు వారికీ నమ్మకమైన ఆశ్రయం కావడంతో, ఈ రైలు వారి ప్రధాన జీవనదారిగా మారింది.

రైలు మార్గంలో కనిపించే బాధలు, ఆశలు

ఈ రైలులో ఎక్కే ప్రతి ప్రయాణికుడి కథ వెనక ఒక పోరాటమే ఉంటుంది. వారు బికనీర్‌కు వెళ్లి చికిత్స తీసుకొని మళ్లీ తిరిగి వస్తుంటారు. చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డ వారు కావడంతో, ఈ ట్రైన్ వారికీ జీవనరేఖగా మారింది. ఒక రైలు దేశంలో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ అనారోగ్యాల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూనే, దేశంలో ఇంకా మానవతా విలువలు బ్రతకుతూన్నాయని కూడా చూపిస్తుంది.

Read Also : EdCET: తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ విడుదల

cancer patients Cancer Patients Train Google News in Telugu train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.