हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

Sudheer
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ ముందుకు సాగేకొద్దీ బీజేపీ మరింత బలంగా ముందుకు వచ్చింది. ఈ విజయానికి కారణం, బీజేపీ ముస్లిం మోర్చా అమలు చేసిన ‘సైలెంట్ క్యాంపెయిన్’ అనే వ్యూహమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వ్యూహంలో భాగంగా బీజేపీ ముస్లిం మోర్చా నేతలు 4-7 మంది సభ్యులుగా చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లాభార్థి యోజనల’ పేరిట ఓటర్ల వివరాలు సేకరించడం ద్వారా, వారు ఎదుర్కొంటున్న అసంతృప్తిని అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించి, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

delhi muslim areas

కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కాకుండా, ప్రతి నియోజకవర్గంలో 70-80 చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్ష ప్రచారాన్ని బలపరిచారు. ఈ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి, తమకు ఓటేస్తే ఇంకా మెరుగైన పాలన అందిస్తామనే నమ్మకం కల్పించారు. దీనివల్ల ఓటర్లు కొత్తగా ఆలోచించేందుకు ప్రేరేపించబడినట్లు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం ఓట్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచే పరిస్థితిలో ఉన్నా, బీజేపీ వ్యూహాత్మకంగా దూసుకువచ్చి సమీకరణాలను మార్చేసింది. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో AAP విఫలమైందనే ప్రచారం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఈ ప్రచారాన్ని స్వయంగా ముస్లిం మోర్చా సభ్యులే నడిపించడం వల్ల మరింత విశ్వసనీయత పెరిగింది. మొత్తంగా ముస్లిం ఓటర్ల మధ్య మెదలైన ఈ మార్పు బీజేపీకి దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది. ప్రత్యేకంగా రూపొందించిన వ్యూహంతో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ విజయాన్ని సాధించగలిగింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870