📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Terror Attack : ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

Author Icon By Sudheer
Updated: April 23, 2025 • 9:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాదానికి మతం లేదని తరచూ చెబుతారు. కానీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద జరిగిన దాడి ఈ వాదనకు భిన్నంగా నిలిచింది. మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడి ఉగ్రవాద మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలవడమే కాదు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రగా విశ్లేషిస్తున్నారు.

కశ్మీర్‌లో మత వివాదాలు

శాంతియుతంగా ఉన్న కశ్మీర్‌లో మత వివాదాలు సృష్టించి, ఆ ఉద్రిక్తతను దేశమంతా వ్యాపింపజేయడం ఈ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి కేవలం ప్రాణనష్టం కలిగించడానికే కాదు, భిన్న మతాల మధ్య వైషమ్యాన్ని పెంచేలా ప్రణాళికాబద్ధంగా జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇది దేశంలోని సామాజిక సమైక్యతను భగ్నం చేయాలన్న దుష్ప్రయత్నం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆదేశాలు

ఈ దాడికి పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ఆదేశాల మేరకు “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” అనే ఉగ్రవాద గుంపు ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు హైఅలర్ట్‌లోకి వెళ్లగా, దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో మతసామరస్యాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించి, దీని వెనకున్న కుట్రల తాలూకు వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఏర్పడింది.

Google News in Telugu Pahalgam Terror Attack Terror attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.