📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India – Pakistan War : యుద్ధం ఇంకా ఆగిపోలేదు – మోడీ సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: May 12, 2025 • 9:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌పై జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి భారత్ గట్టి దెబ్బ కొట్టిందని, పాక్ (Pak) లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం మిస్సైళ్ల దాడులు జరిపిందని వివరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కుటుంబ సభ్యుల సమక్షంలోనే అమానుషంగా హత్యలు చేయించిందని, ఆ దారుణ చర్యపై దేశం మొత్తం ఒక్కటై నిలబడిందని చెప్పారు.

మహిళల సిందూరాన్ని తొలగిస్తే ఏం జరుగుతుందో చూపించాం

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ “దేశంలోని మహిళల సిందూరాన్ని తొలగిస్తే ఏం జరుగుతుందో చూపించాం” అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన భద్రతా బలగాలకు వందనం చేస్తున్నానని, మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. బావల్‌పూర్, మురిద్కే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు ఉగ్రవాద యూనివర్శిటీలుగా మారాయని, అందుకే వాటిపై క్షిపణి దాడులు జరిగాయని వివరించారు.

పాకిస్తాన్ యుద్ధ భూముల్లో వణికిపోయింది

పాక్ నుంచి వచ్చే మిస్సైల్స్, డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థకు మట్టికరవయ్యాయని, పాకిస్తాన్ యుద్ధ భూముల్లో వణికిపోయిందని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ “నేషన్ ఫస్ట్” అనే నినాదంతో ముందుకు వెళ్లిందని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పామన్నారు. చర్చలు ఉంటే అవి పీవోకే గురించి మాత్రమేనని… ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే పాక్‌తో ఇక మోసపోవడం లేదని స్పష్టం చేశారు.

Read Also : India – Pakistan War : పాకు ఆయుధాలు ఇవ్వలేదు – చైనా

Google News in Telugu India-Pak war modi Operation Sindoor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.