ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను(Union Budget) పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ను సందర్శించి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఈ సందర్భంలో రాష్ట్రపతి, ఆర్థిక మంత్రికి పెరుగు–చక్కెర (దహీ–చినీ) తినిపించడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది.
Read Also:Budget2026: పార్లమెంట్కు చేరుకున్న నిర్మలా సీతారామన్
శుభారంభం, విజయానికి ప్రతీకగా భావన
భారతీయ సంప్రదాయాల్లో పెరుగు, చక్కెరలను శుభారంభానికి, విజయానికి సంకేతంగా పరిగణిస్తారు. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు దహీ–చినీ తీసుకోవడం శుభఫలితాలను అందిస్తుందనే విశ్వాసం ఉంది. ఈ సంప్రదాయం ద్వారా బడ్జెట్ ప్రక్రియ విజయవంతంగా సాగాలని, దేశ ఆర్థిక ప్రయాణం సజావుగా మరియు స్థిరంగా కొనసాగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రతి ఏడాది బడ్జెట్(Union Budget) రోజున ఈ ఆచారం కొనసాగుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: