తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్న సంఘటన కరూర్లో చోటుచేసుకుంది. టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ (Vijay) ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు గాయపడిన విషయం తెలిసిందే.
Asia Cup-టీమిండియా గెలుపు.. ఫుల్ జోష్లో స్టాక్ మార్కెట్లు..
విజయ్ కావాలనే రాజకీయ బలప్రదర్శన చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎఫ్ఐఆర్ (FIR) లో పేర్కొన్నారు.”విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకే జనం భారీ ఎత్తున తరలి వచ్చారు.
మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉండగా, ఆయన సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు. భారీ జనసందోహాన్ని చూపించడానికే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. మధ్యాహ్నం నుండి ఎండలో నిలుచున్న ప్రజలు అలసిపోయారు.
ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేవంటూ
విజయ్ బస్సు షెడ్యూల్కు భిన్నంగా పలుచోట్ల ఆగింది. వాటికి అనుమతి కూడా లేదు. అలా ఆగడం వల్ల ట్రాఫిక్ (traffic) కు అంతరాయం ఏర్పడింది” అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేవంటూ చేసిన హెచ్చరికలను విజయ్ కానీ,
పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ కానీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు విజయ్ వచ్చేసరికి జనసమూహాన్ని నిర్వహించడం కష్టంగా మారిందని, అదే తొక్కిసలాటకు దారి తీసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: