📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: TG: తవ్వకాల్లో దొరికిన బంగారం.. పంచుకునే విషయంతో గొడవ

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG ఏమాత్రం కష్టపడకుండా తేరగా వచ్చేది ఏదైనా దానికోసం జనం ఎగబడతారు. ఇంకా దాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. భౌతిక దాడులు చేసుకునేందుకు కూడా వెనుకాడరు. గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారంతో కొందరుతవ్వకాలు జరిపారు.

Read also : Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ

అనుకున్నట్లుగా బంగారం దొరికింది. దాన్ని గుట్టుచప్పుడు కాకుండా పంచుకుంటే బాగుండేది. కానీ దాన్ని స్వార్థంతో సొంతం చేసుకోవాలనే ఉబలాటంలో గొడవలకు దిగారు. ఇంకేమీ ఉంది ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

TG Gold found in excavations… a dispute over sharing

గుప్తనిధుల కోసం తవ్వకాలు

ములుగు జిల్లా (Mulugu District) మంగపేట మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కు మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బంగారం నిధి ఉందని తెలిసింది. ఈ గుప్త నిధి సమాచారం తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన నలుగురిని తీసుకుని ఒక కారులో మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్లారు. సిరివంచ నుంచి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లారు అక్కడ ఓ ఇంట్లో బంగారం ఉన్నదని తెలిసిన సమాచారంలో ఆ ఇంట్లో ఐదురోజులపాటు గడిపి బంగారు (gold) నిధి ఉన్నప్రాంతంలో పూజలు జరిపి తవ్వకాలు చేపట్టారు. అనుకున్నట్లుగా వారికి ఒక రాగిబిందె దొరికింది. 

అనంతరం దీనిపై దుష్టశక్తి ఉందని దానిని తొలగించాక వస్తామని ఇంటి యజమానికి చెప్పి దాన్ని తీసుకుని మంగపేటకు వచ్చారు. అనంతరం మూడు కోళ్లను బలిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం పంపకంలో వీరిమధ్య తేడాలు వచ్చాయి. దీంతో ఆనోట .. ఈనోట అందరికీ తెలిసిపోయింది. ఇది కాస్త పోలీసులకు కూడా తెలియడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ బిందెలో మొత్తం 36 బంగారం బిళ్లలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కోబిళ్ల 23గ్రాముల బరువు ఉందని పోలీసులకు వారు వివరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

gold find dispute Google News in Telugu land excavation Latest News in Telugu property conflict Telangana crime Telugu News Today Treasure discovery

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.